నామినేషన్ల హోరు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:35 AM
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. జిల్లాలో నామినేషన్ల హోరు కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎంపీ రామ్మోహన్నాయుడు నామినేషన్ వేశారు.
కలెక్టరేట్/ ఇచ్ఛాపురం/రణస్థలం, ఏప్రిల్ 24 : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. జిల్లాలో నామినేషన్ల హోరు కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎంపీ రామ్మోహన్నాయుడు నామినేషన్ వేశారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి మన్జీర్ జిలానీ సమూన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు కలమట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు పాల్గొన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి.. ఇచ్ఛాపురంలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి కె.సుదర్శన్దొరకు అశోక్ రెండు సెట్లు, ఆయన సతీమణి బెందాళం నిలోత్పల ఒక నామినేషన్ సెట్ అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నామినేషన్ వేశారు. అలాగే వైసీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా పలువుర్లు నామినేషన్లు వేశారు.