Share News

టీడీపీలోకి భారీ చేరికలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:51 PM

టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధి లోని గిరిజన గ్రామాల్లో పట్టున్న వైసీపీ నాయకులు, 70 కుటుం బాల వారు ఆ పార్టీకి రాజీ నామా చేసి గురువారం టీడీపీలో చేరారు. కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు.

టీడీపీలోకి భారీ చేరికలు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో అచ్చెన్నాయుడు

మేఘవరం పంచాయతీ వైసీపీ నేతలకు

పార్టీలోకి ఆహ్వానం

కండువా వేసి స్వాగతించిన అచ్చెన్నాయుడు

టెక్కలి: టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధి లోని గిరిజన గ్రామాల్లో పట్టున్న వైసీపీ నాయకులు, 70 కుటుం బాల వారు ఆ పార్టీకి రాజీ నామా చేసి గురువారం టీడీపీలో చేరారు. కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో మేఘవరం మాజీ సర్పంచ్‌ అల్లు మాధవరావు, ఐదో వార్డు సభ్యుడు అల్లు వెంక ట్రావు, మాజీ ఉప సర్పంచ్‌ గుంట తవిటయ్య, మాజీ వార్డు సభ్యుడు జి.గోపి నాథ్‌, వైసీపీ కార్యకర్తలు జన్ని చంద్రరావు, గూన రాఘవ రావు, జి.సూర్య నారాయణ, శ్రీరామ్‌, చింతాడ శ్రీనివాస రావు, లంబ భీమా రావు, జన్ని భీమారావు, మాజీ వలంటీర్‌ బమ్మిడి ఫల్గుణరావు తదితర 70 కుటుంబాల వారున్నారు. ఈ సందర్భంగా అల్లు మాధవరావు తదితరులు మాట్లాడుతూ.. అభివృద్ధి అచ్చెన్నాయుడు వల్లే సాధ్యమని భావిం చి తామంతా వైసీపీని వీడి టీడీపీలో చేరామన్నారు. అచ్చెన్నాయుడు మాట్లా డుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి, టీడీపీ-జనసేన కూటమి విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, కెల్లి శ్రీరాములు, వందనం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:51 PM