Share News

వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - May 23 , 2024 | 12:24 AM

డొంకూరు గ్రామానికి చెందిన వివాహిత వాసుపల్లి ఉష(30) ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

ఇచ్ఛాపురం: డొంకూరు గ్రామానికి చెందిన వివాహిత వాసుపల్లి ఉష(30) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. ఉష చాలా కాలం నుంచి తీవ్ర తల నొప్పితో (మైగ్రేన్‌) తో బాధపడుతుంది. ఈ క్రమంలో మంగళ వారం రాత్రి తీవ్ర తలనొప్పి రావడంతో భర్త రామారావుకు చెప్పింది. ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పడంతో నిద్రపోయింది. బుధవారం వేకువ జామున భర్త బయటకు వెళ్లాడు. అదే సమయంలో తలనొప్పి తీవ్రంగా రావడంతో తట్టుకోలే క ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి చూసే సరికి భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.

కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం

టెక్కలి: రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెంది న దాసరి సాయివినీత్‌ (12) మంగళ వారం పాముకాటుకు గురై మృతిచెం దాడు. కుమారుడి మర ణం తట్టుకోలేక తల్లి దాసరి నిరోషా బుధవారం ఇంట్లో ఉన్న మాత్రలు మింగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.

Updated Date - May 23 , 2024 | 12:24 AM