Share News

నాగావళి నదిలో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:10 AM

నాగావళి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని జబ్బావీధికి చెందిన జమ్మా ఎర్రయ్య(56) రామలక్ష్మణ కూడలిలో ఉన్న ఓ స్వీటు షాపులో పనిచేస్తున్నాడు.

నాగావళి నదిలో పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం క్రైం: నాగావళి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని జబ్బావీధికి చెందిన జమ్మా ఎర్రయ్య(56) రామలక్ష్మణ కూడలిలో ఉన్న ఓ స్వీటు షాపులో పనిచేస్తున్నాడు. సో మవారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నదికి వెళ్లగా, అదే సమయంలో మూర్చ రావడంతో మునిగిపోయాడు. ఎర్రయ్య ఎంతకీ రాకపోవడంతో అతడి భార్య చిన్నమ్మ నదికి వెళ్లి చూసింది. అప్పటికే స్థానికులు ఎర్రయ్యను ఒడ్డుకు తీసుకొచ్చి 108కు సమాచారం అందించారు. అప్పటికే ఎర్రయ్య మృతి చెందినట్టు ధృవీకరిం చారు. విషయం తెలుసుకున్న టూ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

ఆటో నుంచి జారిపడి ఒకరు..

మెళియాపుట్టి: కరజాడ గ్రామానికి చెందిన బమ్మిడి అన్నయ్య(54) సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్వగ్రామం నుంచి నందిగాం మండలం హరిదాసుపురానికి ఆటోలో వెళుతుండగా వెనుకన కూర్చొన్న అన్నయ్య జారిపడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమై మృతి చెందాడు. హరిదాసుపురంలో బంధువు మృతి చెందడంతో పరామర్శకు గ్రామస్థులతో కలిసి ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్‌ అతివేగంగా వెళ్లడం వల్లే అన్నయ్య జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కరజాడ పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించినా అప్పటికే మృతి చెందాడు. అన్నయ్య పక్కనే కూర్చొన్న జగన్నాథం స్వల్వ గాయాలతో బయటపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు..

పొందూరు: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమా దంలో గుర్తుతెలియని యువకుడు (సుమారు 24) మృతి చెందాడు. రైలు పట్టాలపై మృతదేహం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలులో వెళ్తూ ప్రమాదవశాత్తు ఆ యువకుడు జారిపడి మృతిచెంది ఉంటాడని అ నుమానిస్తున్నారు. ఎరుపురంగు టీషర్టు నలుపురంగు నైట్‌ఫ్యాంటు ధరించి ఉన్నాడ న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Jan 30 , 2024 | 12:10 AM