Share News

మాదిగ ద్రోహి.. జగన్‌రెడ్డిని నమ్మకండి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:12 AM

మాదిగల ద్రోహి సీఎం జగన్‌ రెడ్డి అని.. ఎవరూ నమ్మవద్దని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

మాదిగ ద్రోహి.. జగన్‌రెడ్డిని నమ్మకండి
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

ఆమదాలవలస: మాదిగల ద్రోహి సీఎం జగన్‌ రెడ్డి అని.. ఎవరూ నమ్మవద్దని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో మాదిగ కులస్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు మాదిగలకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా 22 వేల ఉద్యో గాలు లబ్ధి పొందారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాదయాత్రలో మాదిగలు సమస్యలపై ఇచ్చిన అర్జీలు బుట్టదాఖలు చేసి ఎస్సీలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతుగా నిలవా లన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షుడు లోపింటి నారాయణ రావు, నాయకులు టింగరాజు, రాడ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:12 AM