అనుకూలమైన నిర్ణయం కోసం వేచి చూద్దాం
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:16 AM
రాజకీయ పార్టీలో అసమ్మతి అనేది క్యాన్సర్ లాంటిదని, తొలి దశలోనే దానిని నివారించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు.
![అనుకూలమైన నిర్ణయం కోసం వేచి చూద్దాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అరసవల్లి: రాజకీయ పార్టీలో అసమ్మతి అనేది క్యాన్సర్ లాంటిదని, తొలి దశలోనే దానిని నివారించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాము నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం కావాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరామన్నా రు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మమ్మల్ని సంప్రదించి నిర్ణయం ప్రకటించ డానికి కొద్ది సమయం వేచి ఉండాలని కోరారని, అనుకూలమైన నిర్ణయం కోసం మరికొంత సమయం వేచి చూద్దామని తెలిపారు. రెండేళ్ల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షు డితో అసమ్మతి గురించి మాట్లాడినప్పటికీ చర్యలు తీసుకోలేదు సరికదా, వారిని అందలం ఎక్కించడమే ప్రస్తుత సమస్యకు కారణమన్నారు. పార్టీ శ్రేయస్సుకు అను కూలమైన నిర్ణయం వస్తుందని, అందరూ క్రమశిక్షణతో ఎదురుచూద్దామన్నారు.