Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వైసీపీ విధ్వంసకర విధానాలను ప్రతిఘటిద్దాం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:09 AM

దోపిడీ, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిన వైసీపీ విధ్వంసకర విధానాలను ప్రతిఘటిద్దామని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ పిలుపునిచ్చారు.

వైసీపీ విధ్వంసకర విధానాలను ప్రతిఘటిద్దాం

అరసవల్లి: దోపిడీ, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిన వైసీపీ విధ్వంసకర విధానాలను ప్రతిఘటిద్దామని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమంగా ఆర్జించిన దోపిడీ సొమ్ముతో మళ్లీ రానున్న ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వద్దామని చూస్తున్న జగన్‌రెడ్డికి బీసీలందరూ ఏకమై బుద్ధి చెబుదామన్నారు. ఈ నెల 5వ తేదీన మంగళగిరిలో నిర్వహించనున్న జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సెల్‌ అధ్యక్షుడు ఉంగటి రమణ, తెలుకల సాధికార సమితి డైరెక్టర్‌ కొమ్మనాపల్లి వెంకటరామరాజు, జంగమ సాధికార సమితి సభ్యుడు విభూది సూరిబాబు, బీసీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బుక్కా యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:09 AM