Share News

జగన్‌రెడ్డి పాలన సంక్షేమం కాదు.. సంక్షోభం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:03 AM

రాష్ట్రంలో కొనసాగుతున్నది సంక్షేమ పాలన కాదని.. సంక్షోభ రాజ్యం అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు.

జగన్‌రెడ్డి పాలన సంక్షేమం కాదు.. సంక్షోభం

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్నది సంక్షేమ పాలన కాదని.. సంక్షోభ రాజ్యం అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరు లతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుకు ఉరి వేశారని, ఇరిగేషన్‌ను బలి చేశారని విమర్శించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత జగన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. కాం ట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తే, జగన్‌ మాఫియా తెచ్చాడని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజ లు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, యువతకు ఉద్యోగాలు రావు అన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చినా జగన్‌రెడ్డికి ఓటమి తప్పదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 12:03 AM