Share News

ఇలపండపేటలో ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:43 PM

బొద్దాం పంచాయతీ ఇలపండపేట గ్రామంలో దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆవిష్కరించారు.

ఇలపండపేటలో ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణ

ఇలపండపేట(పోలాకి): బొద్దాం పంచాయతీ ఇలపండపేట గ్రామంలో దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయా లని కోరారు. ఇలపండపేటలో పలువురు అభిమానులు టీడీపీలో చేరారు. వారికి ఎంపీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు మిరియబిల్లి వెంకట అప్పలనాయుడు, నాయకులు బైరి భాస్కరరావు, బగ్గు అర్చన, సూరపు నారాయణదాస్‌, కరుకోల రమేష్‌ బాబు, కోరాడ నాగరాజు, విష్ణు, వై.లక్ష్మణరావు, మెండశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:43 PM