Share News

ఎన్నికల సిబ్బందికి ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తారంటే..

ABN , Publish Date - May 01 , 2024 | 11:47 PM

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధులకు సెక్టార్‌ ఆఫీసరు కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్‌ మేజిస్ట్రేట్‌కు ఏకమొత్తంగా రూ.1500 చెల్లిసారు.

ఎన్నికల సిబ్బందికి ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తారంటే..

(నరసన్నపేట)

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన రెమ్యునరేషనే కొనసాగించనున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో చెల్లించిన రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధులకు సెక్టార్‌ ఆఫీసరు కాకుండా అదనంగా నియమితులయ్యే జోనల్‌ మేజిస్ట్రేట్‌కు ఏకమొత్తంగా రూ.1500 చెల్లిసారు.

ఫ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అండ్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కు రోజుకు రూ.350 చెల్లించనున్నారు.

ఫ నాలుగో తరగతి ఉద్యోగులకు రోజుకు రూ.200, వీడియా సర్వేలైన్స్‌ టీమ్‌కు రూ.1200, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌, అకౌంటింగ్‌ టీమ్‌కు రూ.1000 చెల్లిస్తారు.

ఫ కంట్రోల్‌ రూమ్‌, కాల్‌సెంటర్‌ స్టాప్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీకి రోజుకు రూ.200.

ఫ సెక్టోరల్‌ ఆఫీసర్‌కు రూ.5000, మాస్టర్‌ ట్రైనర్‌కు రూ.2000, అసిస్టెంట్‌ ఎక్స్‌పెండేచర్‌ అబ్జర్వర్‌కు రూ.7,500 చెల్లిస్తారు.

ఫ పోలింగ్‌ రోజున విధులకు నియమితులయ్యే పోలీసు సిబ్బందికి, మొబైల్‌ పార్టీ సిబ్బందికి, హోం గార్డులకు, ఫారెస్టు గార్డులకు, గ్రామ రక్షక దళం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు ప్యాక్ట్‌ లంచ్‌ లేదా రూ.150 నగదు చెల్లిస్తారు. ఎన్నికల్లో పోలింగ్‌ విధులకు, ఓట్ల లెక్కంపు విధులకు నియమితులైన వారికి రెమ్యునరేషన్‌తో పాటు లంచ్‌కు రూ.150 చెల్లిస్తారు. అర్హత మేరకు డీఏ చెల్లిస్తారు.

ఉద్యోగులు పెదవి విరుపు..

ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన రెమ్యునరేషన్‌పై ఉద్యోగులు పెదవి విరిస్తున్నారు. ఎంతో కష్ట తరమైన పోలింగ్‌ విధులకు నియమితులైన ఉద్యోగులకు నామమాత్రంగా రెమ్యునరేషన్‌ చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేయడంపై వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కంచిలిలో పని చేస్తున్న వారికి సుమారు 150 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఎచ్చెర్ల, ఆమదా లవలస, శ్రీకాకు ళం నియోజవర్గాలకు కేటాయించారు. అంత దూరం వెళ్లి విధులు నిర్వహించి రావాలంటే కనీసం వెయ్యి రూపాయిలు ఖర్చు వుతుంది. ఎంఈవోలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్‌ విషయంలో ఈసీ పునరాలోచించి రెమ్యూనరేషన్‌ పెంచుతూ తాజా ఉత్తర్వులు సవరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - May 01 , 2024 | 11:47 PM