Share News

మహిళా కండక్టర్‌ నిజాయితీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:43 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు బంగారు గొలుసు పోగొట్టుకోగా గమనించిన కండక్టర్‌ ఆమెకు ఆ ఆభరణాన్ని అందించి తన నిజాయితీని నిరూపించుకున్నారు.

మహిళా కండక్టర్‌ నిజాయితీ
రాణికి గొలుసును అందజేస్తున్న కండక్టర్‌ విజయకుమారి

టెక్కలి: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు బంగారు గొలుసు పోగొట్టుకోగా గమనించిన కండక్టర్‌ ఆమెకు ఆ ఆభరణాన్ని అందించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ట్రిప్పులో టెక్కలి-పాతపట్నం రూట్‌లో వెళు తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పొట్నూ రు రాణి రెండు తులాల గొలుసును పోగొటు ్టకుంది. కండక్టర్‌ టిక్కెట్లు ఇస్తున్న సమయంలో తెంబూరు దాటిన తరువాత ఆ గొలుసు కండ క్టర్‌కు దొరికింది. అయితే అప్పటికే తెంబూరులో దిగిపోయిన రాణి ఇంటికి వెళ్లి తన మెడలో గొలుసు లేకపోవడంతో ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు ద్విచక్ర వాహ నంపై వెళ్లారు. బస్సు పాతపట్నంలో ఉండడంతో బస్సులో వెతకడం ప్రారంభించింది. దీనిపై వివరాలు ఆరా తీసిన కండక్టర్‌ గొలుసు తనకు దొరికిందని చెప్పడంతో రాణి ఊపిరిపీల్చు కుంది. పూర్తి వివరాలు సేకరించి కండకర్టర్‌ ఆ గొలుసుకు ఆమెకు అందజేసింది. వెంటనే ప్రయాణికులు కండక్టర్‌ విజయకుమారిని అభినందించారు.

Updated Date - Jul 08 , 2024 | 11:43 PM