అయ్యో స్పీకర్ గారూ..
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:08 AM
రాష్ట్రంలో ప్రధాన పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మ కంగా భావిస్తున్న సార్వ త్రిక ఎన్నికల ప్రచారం ఆమదాలవలస నియో జకవర్గంలో వింత పో కడలు కనిపిస్తున్నాయి.
![అయ్యో స్పీకర్ గారూ..](https://media.andhrajyothy.com/media/2024/20240326/5_sarubujjili_5_574525acc4.gif)
ఆమదాలవలస: రాష్ట్రంలో ప్రధాన పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మ కంగా భావిస్తున్న సార్వ త్రిక ఎన్నికల ప్రచారం ఆమదాలవలస నియో జకవర్గంలో వింత పో కడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నెలకొన్న గ్రూప్ల గోల ఆ పార్టీ అభ్యర్థి, స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రచారానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో సువ్వారి గాంధీ, కోట గోవిందరావు, చింతాడ రవికుమార్... స్పీకర్ తమ్మినేనిని విభేదించి గత కొంత కాలంగా వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. వీరిలో గాంధీ వైసీపీకి రాజీనా మా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాననంటూ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్ర చారం కొనసాగిస్తున్నారు. ఇక చింతాడ రవికుమార్ ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించడంతో ఇక్కడ ప్రచారానికి కొంతదూరం కావాల్సి వచ్చింది. ఇక కోట గోవిందరావు కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్పీకర్ తమ్మినేని సీతారాం కలివరం పంచాయతీలో ప్రచారం నిర్వహిం చారు. తమ్మయ్యపేటలో ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు గోవిందరావు ఇంటికి స్పీకర్ వెళ్లి చేతులు జోడించి నమస్కరించినా అతడు పట్టించుకోలేదు. ఈ ఘటన ను చూసిన వైసీపీ నాయకులు ఏమి చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోయారు.