Share News

బాలికపై వేధింపులు.. పోక్సో కేసు నమోదు

ABN , Publish Date - May 29 , 2024 | 11:45 PM

రూరల్‌ మండలంలో బాలికను కొన్నాళ్లగా ఓ వ్యక్తి లైంగికం గా వేధిస్తుండడంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలికపై వేధింపులు.. పోక్సో కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం: రూరల్‌ మండలంలో బాలికను కొన్నాళ్లగా ఓ వ్యక్తి లైంగికం గా వేధిస్తుండడంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిపై రూరల్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వాసుదేవ రావు తెలిపిన వివరాల మేరకు.. జలుమూరు మండలం గొట్టివాడ గ్రామానికి చెంది న ఆటో డ్రైవర్‌ లోపింటి నర్సింహులు.. శ్రీకాకుళంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇం టర్‌ చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో గతేడాది జూలై నుంచి వేధిస్తున్నా డు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి సాయంతో మంగళవారం రాత్రి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సింహులపై పోక్సో కేసు నమోదు చేశామని, కేసును శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

లైంగిక దాడి కేసుపై డీఎస్పీ విచారణ

పొందూరు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారిపై లైంగికదాడి జరిగినట్టు అందిన ఫిర్యాదు మేరకు దిశ డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఈ లైంగికదాడిపై నివేదిక కోరడంతో ఈ కేసుపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేయగా, దిశ డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పలువురిని విచారించి సమాచారాన్ని సేకరించారు. గతంలోను ఈ యువ కుడు ఇటువంటి ఘటనలకు పాల్పడినట్లు ఆ గ్రామస్థులు డీఎస్పీకి తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 11:45 PM