‘వేధింపులే నా భర్త చావుకు కారణం’
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:53 AM
నా భర్త జి.దామోదరరావు (జగన్ పత్రికలో విలేకరి) మృతికి స్థానిక అధికార పార్టీ నాయకుల వేధింపులే కారణమని అతడి భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.
![‘వేధింపులే నా భర్త చావుకు కారణం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
లావేరు: నా భర్త జి.దామోదరరావు (జగన్ పత్రికలో విలేకరి) మృతికి స్థానిక అధికార పార్టీ నాయకుల వేధింపులే కారణమని అతడి భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె తన స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, రాజకీయ నాయకుల వేధింపుల వల్లే నా భర్త మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై సమగ్ర దర్యా ప్తు చేసి, న్యాయం చేయాలని కోరారు. కాగా దామోద రరావు మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని టీడీపీ నేత కిమిడి కళావెంకటరావు డిమాండ్ చేశారు. ఆదివారం కేశవరాయపురం గ్రామంలో దామోదరరావు ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.