Share News

నేడు గౌతు శిరీష నామినేషన్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:04 AM

పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు.

 నేడు  గౌతు శిరీష నామినేషన్‌

పలాస: పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. నిరాడంబరంగా ఎన్నికల నిబంధన అనుసరించి ఆమె నామినేషన్‌ వేస్తారని టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వడగాల్పుల నేపథ్యంలో కొద్దిమంది నాయకులు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి నామినేషను దాఖలు చేయనున్నారు.

మామిడి గోవిందరావు కూడా..

పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు పైల బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కింజ రాపు అచ్చెంనాయుడు, పార్టీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహననాయుడు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

రేపు బగ్గు రమణమూర్తి...

నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు బగ్గు రమణమూర్తి శనివారం నామినేషన్‌ వేయనున్నట్లు టీడీపీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8 గంటలకు రమణమూర్తి తన స్వగ్రామం పోలాకి మండలం మబుగాంలో బయలుదేరిగా ర్యాలీగా నరసన్న పేటకు బయలుదేరుతారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు.

23న రవికుమార్‌..

ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్‌ ఈ నెల 23న నామినేషన్‌ వేయనున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10.45 గంటకు ఆమదాలవలస తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేయనున్నట్టు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని రవికుమార్‌ కోరారు.

Updated Date - Apr 19 , 2024 | 12:04 AM