నవరత్నాల పేరిట మోసం: కృపారాణి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:16 PM
నవరత్నాలు పేరిట సీఎం జగన్ ప్రజలకు మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిత డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు.
టెక్కలి: నవరత్నాలు పేరిట సీఎం జగన్ ప్రజలకు మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిత డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. గురువారం ఇండియా కూటమి నాయకులతో ఆమె స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అమ్మి రూ.40 వేల కోట్లు దోచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని విమర్శించారు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేడాడ పర మేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ, వైసీపీలు విఫలమయ్యా యన్నా రు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణ మన్నారు. సమావేశంలో సీపీఎం, సీపీఐ నాయకులు నంబూరు షణ్ముఖరావు, హనుమంతు ఈశ్వరరావు, చాపర వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు టీబీజీ గుప్త, దాట్ల లింగమూర్తి పాల్గొన్నారు.