నాలుగు ఎకరాల వరి కుప్పలు దగ్గం
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:20 AM
మండలంలోని పెంట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కిల్లారి రమణ అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి.
![నాలుగు ఎకరాల వరి కుప్పలు దగ్గం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- రూ.1.90 లక్షల ఆస్తి నష్టం
జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కిల్లారి రమణ అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి. నూర్పు చేసేందుకు రమణ తన కల్లంలో వరి కుప్పలు పెట్టాడు. అయితే పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్కూట్ జరిగి కుప్పలపై నిప్పులు రాలడంతో కాలిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఆస్తినష్టం సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనావేశారు. సుమారు 100 బస్తాలు ధాన్యం కావల్సిన పంట కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు రమణ కోరుతున్నాడు.