Share News

జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:58 PM

మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి.

జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం
మంటలార్పుతున్న అగ్నిమాపకసిబ్బంది

హరిపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్క పరిశ్రమలో ఉన్న కార్మికులు, కాలసీ వాసులు అప్రమత్తమై పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలో జీడిపిక్కలు, రవాణాకు సిద్ధంగా ఉన్న జీడి పప్పు అగ్నికి ఆహుతైనట్టు తెలిపారు. సుమారు రూ.2కోట్ల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సంఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:58 PM