Share News

22న ఓటర్ల తుది జాబితా

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

ఓటర్ల తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు.

 22న ఓటర్ల తుది జాబితా
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

- ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం

-కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

కలెక్టరేట్‌, జనవరి 11: ఓటర్ల తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. రాజకీయ పార్టీలు అందించే వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటిస్తామన్నారు. తక్కువ సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బీఎల్వోల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరిగిందని, ఏమైనా పొరపాట్లు జరిగితే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని తెలిపారు. క్యాండిడేట్‌ హ్యాండ్‌బుక్‌ ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 12న (శుక్రవారం) నాటికి అన్ని క్లెయిమ్‌లను పరిష్కరిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరినట్లుగానే డబుల్‌ ఎంట్రీ, పోలింగ్‌ బూత్‌లు తదితర అంశాలపై నివేదిక అంజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, పీఎంజే బాబు (టీడీపీ), రౌతు శంకరరావు (వైసీపీ), ఎల్‌.సోమేశ్వరరావు(బీఎస్పీ), పి.సురేష్‌బాబు సింగ్‌(బీజేపీ), సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:09 AM