తగాదాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - May 15 , 2024 | 11:53 PM
ఇటీవల జరిగిన సార్వ త్రిక ఎన్నికల నేపథ్యం లో నియోజక వర్గంలో ని పలు సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ను బుధవారం శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి పరిశీ లించారు.
![తగాదాలకు దూరంగా ఉండాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆమదాలవలస: ఇటీవల జరిగిన సార్వ త్రిక ఎన్నికల నేపథ్యం లో నియోజక వర్గంలో ని పలు సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ను బుధవారం శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి పరిశీ లించారు. ఎన్నికలు సందర్భంగా పలు గ్రా మాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వా దాలు, కొట్లాటలకు దారితీసింది. ఈ నేప థ్యం ఆయా గ్రామాల్లో శాంతిభద్రతలకు భం గం వాటిల్లకుండా పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆమదాల వలస సర్కిల్ పరిధిలో కుద్దిరాం ఐజే నాయుడు కాలనీ దన్నాన్నపేట, సరుబుజ్జిలి మండలం చిగురువలస గ్రామల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కుద్దిదారంలో ఐజే నాయుడు కాలనీలో డీఎస్పీ శృతి పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామస్థులతో మాట్లాడారు. ఎన్నికలు వస్తాయి, పోతాయని వాటి కోసం తగాదాలుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డీఎస్పీ వెంట సీఐ జి.దివాకర్యాదవ్, సిబ్బంది ఉన్నారు.