Share News

సిగ్నల్‌ పాయింట్ల వద్ద గ్రీన్‌ షేడ్‌ నెట్‌ ఏర్పాటు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:21 AM

జిల్లా కేంద్రంలో భానుడి తీవ్రతతో ఇబ్బందులు పడు తున్న వాహనదారులకు ఊరట కలిగించేందుకు నగర పాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా చర్యలు చేపట్టారు.

సిగ్నల్‌ పాయింట్ల వద్ద గ్రీన్‌ షేడ్‌ నెట్‌ ఏర్పాటు
మిల్లు జంక్షన్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్‌ షేడ్‌ నెట్స్‌

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా కేంద్రంలో భానుడి తీవ్రతతో ఇబ్బందులు పడు తున్న వాహనదారులకు ఊరట కలిగించేందుకు నగర పాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా చర్యలు చేపట్టారు. పట్టణంలోని కూడళ్ల వద్ద సిగ్నల్‌ కోసం వేచి ఉండాల్సిన సమయంలో ఎండ తగుల కుండా ఉండేం దుకు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్ల వద్ద గ్రీన్‌ షేడ్‌ నెట్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో వీటిని ఏర్పాటు చేశామని, కొంతమేర వాహన దారులకు వేసవి ఉపశమనం కలుగుతుందన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:21 AM