యోగా పీజీ కోర్సులో చేరేందుకు దర ఖాస్తులు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:17 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్నెస్ మెనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమో కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ర్టార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్నెస్ మెనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమో కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ర్టార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, రూ.500 అపరాధ రుసుంతో జూన్ 27వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. ఈ కోర్సులో చేరేం దుకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలన్నారు. ఈ కోర్సుకు రూ.10 వేలు ఫీజు ఉంటుందన్నారు. వర్శిటీ విద్యార్థులు ట్యూషన్ ఫీజులో 30 శాతం, బోధన, బోధనేతర సిబ్బందికి ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.