Share News

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

ABN , Publish Date - May 19 , 2024 | 12:00 AM

తామరాపల్లి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మాన చిన్నమ్మడు (65) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

నరసన్నపేట: తామరాపల్లి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మాన చిన్నమ్మడు (65) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. తామ రాపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయం లో టెక్కలి నుంచి నరసన్నపేట వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నమ్మడుకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. చిన్నమ్మడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్‌ స్తంభం పడి వ్యక్తి మృతి

పొందూరు: రెడ్డిపేట సమీపంలో జరుగుతున్న విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు సమ యంలో ప్రమాదవశాత్తు స్తంభం పడడంతో పాగోటి ధర్మారావు(52) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం మండలం సింగుపురం పంచాయ తీ మామిడివలస గ్రామానికి చెందిన పాగోటి ధర్మారావు, రెడ్డిపేట - తాణేం గ్రామా ల మధ్యలో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటులో భాగంగా వెల్డింగ్‌ పనుల కార్మికుడిగా ధర్మారావు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం విద్యుత్‌ స్తంభం పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు అది ధర్మారావుపై పడింది. దీంతో ధర్మారావు తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే తోటి కార్మికులు స్పందించి శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలిం చగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - May 19 , 2024 | 12:00 AM