వివాహిత మృతిపై డీఎస్పీ విచారణ
ABN , Publish Date - May 31 , 2024 | 11:58 PM
శేతు భీమవరం పంచాయతీ పెనసాం గ్రామంలో శుక్రవారం బెవర మే రీ సలోమి అలియాస్ నిఖిత (22) అనే వి వాహిత అనుమానాస్ప ద స్థితిలో మృతి చెం దిన విషయం తెలి సిందే.
![వివాహిత మృతిపై డీఎస్పీ విచారణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జి.సిగడాం: శేతు భీమవరం పంచాయతీ పెనసాం గ్రామంలో శుక్రవారం బెవర మే రీ సలోమి అలియాస్ నిఖిత (22) అనే వి వాహిత అనుమానాస్ప ద స్థితిలో మృతి చెం దిన విషయం తెలి సిందే. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సలోమి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సలోమి భర్త జగదీష్, మరిది ఈశ్వరరావు, అత్త మల్లేశ్వరి, మామ అప్పలనాయుడి వరకట్న వేధింపులు వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు శంకరరావు, దేవి ఆరోపించారు. తండ్రి శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వై.మధుసూధనరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.