అన్న క్యాంటీన్కు విరాళాలు
ABN , Publish Date - Oct 04 , 2024 | 11:26 PM
టెక్కలి, కోటబొమ్మాళి మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలను అందించారు. ఈమేరకు దాతలు నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చె న్నాయుడును కలిసి చెక్కులను అందిం చారు.
కోటబొమ్మాళి: టెక్కలి, కోటబొమ్మాళి మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలను అందించారు. ఈమేరకు దాతలు నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చె న్నాయుడును కలిసి చెక్కులను అందిం చారు. కోటబొమ్మాళికి చెందిన సకలాభక్తు ల సదాశివావు జ్ఞాపకార్థం ఆయన భార్య సులోచనమ్మ కుమారుడు గంగారావు రూ.1,00,116 చెక్కును అందజేశారు. కళిం గ వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి రాంకుమార్, సోదరులు వారి తల్లిదండ్రుల స్మారి కగా రూ.లక్ష, పొట్నూరు నరసింహా సోదరులు, బోయిన శివప్రసాద్ చెరో రూ. 25 వేలు చొప్పు న చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లి నాగయ్యరెడ్డి, కల్లి లక్ష్మణ రెడ్డి, నంబాళ్ల రాజశేఖర్, పంచిరెడ్డి లచ్చుమయ్య, డోకి రమణమూర్తి పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్నకు చెక్కును అందజేస్తున్న గంగారావు తదితరులు (కెబిఎం 3)