పిల్లలతో వివాహిత అదృశ్యం
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:25 AM
పిల్లలతో సహా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన నగరంలో చోటుచేసుకుంది.
![పిల్లలతో వివాహిత అదృశ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీకాకుళం క్రైం: పిల్లలతో సహా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన నగరంలో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎల్బీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న చింతాడ రాజవర్ధన్.. తన భార్య బొమ్మాళి తులసి, ఐదేళ్ల కుమార్తె హాసిని, మూడేళ్ల కుమారుడు వేదికతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తులసి తన పిల్లలను పార్కుకి తీసుకెళ్తానని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంతసేపటికి రాకపోవడంతో పరిసరాలతోపాటు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వన్టౌన్ పోలీసులకు రాజవర్ధన్ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్ఐ బలివాడ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.