Share News

డిపాజిట్లు చెల్లించాలని సహారా బాధితుల ధర్నా

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:37 PM

తాము సహారా ఇండియాలో దాచుకున్న డిపాజిట్లను చెల్లించాలని కోరుతూ బాధితులు గురువారం పట్టణంలో ధర్నా నిర్వహించారు.

డిపాజిట్లు చెల్లించాలని సహారా బాధితుల ధర్నా
నరసన్నపేటలో ర్యాలీ చేపడుతున్న సహారా బాధితులు

నరసన్నపేట: తాము సహారా ఇండియాలో దాచుకున్న డిపాజిట్లను చెల్లించాలని కోరుతూ బాధితులు గురువారం పట్టణంలో ధర్నా నిర్వహించారు.సహారా కార్యాలయం నుండి పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి వెంటనే డిపాజిట్లను చెల్లించి ఆదుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గోపాలరావు, పెంటబాబు ఏజెంట్లు, బాధితులు పాల్గొన్నారు.

పాతపట్నంలో...

పాతపట్నం: తాము దాచుకున్న డిపాజిట్లను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సహారా ఖాతాదారులు గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గమ్మగుడి కాలనీ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. సంస్థకు చెందిన హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ రావిపాటి రామ కోటేశ్వరరావు, శ్రీకాకుళం రీజనల్‌ మేనేజర్‌ బరాటం లక్ష్మణరావు కొందరు పేద గిరిజనుల ద్వారా ఇప్పటికీ కొత్త వ్యాపారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 01 , 2024 | 11:37 PM