టీడీపీతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే అశోక్
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:27 AM
టీడీపీతోనే అభి వృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బెందా ళం అశోక్ అన్నా రు. శుక్రవారం మున్సిపాల్టీ పరి ధిలో గల వివిధ అభివృద్ధి పనుల కు భూమిపూజ చేశారు.
ఇచ్ఛాపురం: టీడీపీతోనే అభి వృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బెందా ళం అశోక్ అన్నా రు. శుక్రవారం మున్సిపాల్టీ పరి ధిలో గల వివిధ అభివృద్ధి పనుల కు భూమిపూజ చేశారు. 21వ వార్డు గొల్లవీధిలో ఎంపీ నిధులు రూ.5లక్షలతో సామాజిక భవనం, 17వ వార్డు సంతపేటలో ఎంపీ నిధులు రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ఒక్క రోడ్డు గాని, సామాజిక భవనం గాని నిర్మించలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి దాసరి రాజు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందికి జాని, రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, కౌన్సిలర్లు కాళ్ల వెంకటలక్ష్మి, కాళ్ల దిలీప్, పత్రి తవిటయ్య, ఆశి లీలారాణి, జి.శేఖర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల జయదేవ్, రెయ్యి జానికీరావు, ఆశి జీవులురెడ్డి, ఊనా సంతోష్, సాలిన జగదీష్, జిలాని, కొరాయి ధర్మరాజు, దక్కత ఢిల్లీరావు, సీపాన వెంకటరమణ, మణిచంద్రప్రకాష్ పాల్గొన్నారు.
- కవిటి: కవిటి కొత్తూరు గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును శుక్రవారం ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి నిధులు టీడీపీ హయాంలోనే ఎక్కువగా వెచ్చించినట్టు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్, నాయకులు బి.రమేష్, ఎస్.వెంకటరమణ, కె.వాసు, సంతోష్పట్నాయక్, బి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.