Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:35 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం జిల్లాలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌సిక్స్‌ పథకాలపై టీడీపీ నాయకుల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. పలుచోట్ల వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.

 చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
బూర్జ: సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తున్న కూన రవికుమార్‌:

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం జిల్లాలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌సిక్స్‌ పథకాలపై టీడీపీ నాయకుల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. పలుచోట్ల వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.

ఫ కవిటి: టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. రాజపురం, చిన్నసహలాలపుట్టుగల్లో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యునిటీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నసహలాల పుట్టుగ గ్రామానికి చెందిన యర్ర చైతన్య, భగవాన్‌, సారధి, పి.ఆర్జున్‌, ఎర్ర మధు, పి.ప్రేమ్‌, జి.చింతామణి తదితర 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్‌, సదానంద రౌళో, టి.మోహనరావు, బి.చిన్నబాబు, బాసుదేవ్‌ ప్రదాన్‌ పాల్గొన్నారు.

ఫ బూర్జ: సూపర్‌సిక్స్‌ పథకాలతో రాష్ట్రంలో మహిళాసాధికారిత సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. మండలంలోని గుత్తావల్లిలో సూపర్‌సిక్స్‌ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పేడాడ రామ్మోహన్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆనెపు రామకృష, సర్పంచ్‌ హనుమంతు మీనాక్షి, ఎంపీటీసీ కె.శ్రావణి, నాయకులు పైడి సత్యప్రసాద్‌, మండల అధ్యక్షుడు రాంజీ, హనుమంతు గోపి, కడగల కృష్ణ, శ్రీరామ్మూర్తి, గణపతి, జగన్నాథనాయుడు, కె.గోపి పాల్గొన్నారు.

ఫ సంతబొమ్మాళి: గ్రామాల్లో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు,రెడ్డి అప్పన్న తెలిపారు. నౌపడలో సూపర్‌సిక్స్‌ పఽథకాలపై ఇంటింటా టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుగ్గు స్వరూప్‌రెడ్డి, సూరాడ ధనరాజ్‌, బెండి అరుణ్‌కుమార్‌, కర్రి విష్ణుమూర్తి పాల్గొన్నారు.

ఫ కంచిలి: చిలకలమెట్టలో సూపర్‌సిక్స్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి మాదిన రామారావు, బొడ్డ హరిబాబు, జి.మన్మధరావు, పైల మన్మఽథరావు, శ్రీకాంత్‌, కిరణ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

ఫ సరుబుజ్లిలి: సరుబుజ్జిలిలో టీడీపీ నాయకులు ఎండ రామారావు, దవళ సింహాచలం, పాతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్‌ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దవళ సురేష్‌, బెండి రామ్మూర్తినాయుడు, కూన రమణ, చింతాడ ధనుంజయ పాల్గొన్నారు.

ఫ నందిగాం: మండలంలోని రధజనబొడ్డపాడు, బడబంద, శివరాంపురంలో టీడీపీ మండలాధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.బాలకష్ణ, ఎస్‌.జానకిరాం, బి.గిరిబాబు, కె.ధర్మారావు, ఎ.రమేష్‌, కె.ప్రసాదరావు, ఎన్‌.తిరుపతిరావు, శశి పాల్గొన్నారు.

ఫ పొందూరు: మండలంలోని తోలాపిలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పొన్నాడ రామారావు, బుజ్జి, ఉప సర్పంచ్‌ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం: టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ఇంటిళ్లపాదికి లబ్ధి చేకూరుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, 11వ వార్డు కౌన్సి లర్‌ ఆశి లీలారాణి అన్నారు. ఈ మేరకు గురువారం వార్డులో టీడీపీ అమ లు చేయనున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.

Updated Date - Mar 14 , 2024 | 11:35 PM