నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:18 PM
విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించు కోవాలని, దీనికి ఇటువంటి కార్యక్రమాలను వినియోగించు కోవాలని రాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ టెంటు అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్ట్ చాంపియన్షిప్-2కే24, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన యాక్తాన్- 2కే24 పోటీలను మంగళవారం ఆయన ప్రారంభిం చారు.
![నైపుణ్యాలను పెంపొందించుకోవాలి](https://media.andhrajyothy.com/media/2024/20240227/27tklp3_f6cc684d9e.gif)
కె.కొత్తూరు (టెక్కలి): విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించు కోవాలని, దీనికి ఇటువంటి కార్యక్రమాలను వినియోగించు కోవాలని రాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ టెంటు అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్ట్ చాంపియన్షిప్-2కే24, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన యాక్తాన్- 2కే24 పోటీలను మంగళవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఇన్నోవేషన్ సొసైటీ సైతం 40 యూనివర్సిటీలతో కలిపి యాక్ తాన్ వంటి పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలను ఐతం కళాశాల నిర్వహించడం అభినం దనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వర రావు, కార్యదర్శి ఎల్ఎల్ నాయు డు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వీవీ నాగేశ్వర రావు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.