గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - May 31 , 2024 | 11:59 PM
మండలంలోని దూసి గ్రామ సమీపంలో సుమారు 40 సం వత్సరాలు వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు.
![గుర్తు తెలియని వ్యక్తి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆమదాలవలస: మండలంలోని దూసి గ్రామ సమీపంలో సుమారు 40 సం వత్సరాలు వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. శుక్రవారం దూసి వీఆర్వో రాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీ లించగా దూసి రైల్వేస్టేషన్ సమీపంలోని జీడితోటలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం పడి ఉండడాన్ని గుర్తించడం జరిగిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృ తదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్లో భద్రపరిచినట్టు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు ఆమదాలవలస పోలీసులను సం ప్రదించాలని కోరారు.