అవినీతి పాలనను అంతం చేయాలి
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:33 AM
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, దీనిని అంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పట్టణ నాయకులు బోయన సతీష్, తాళాభక్తుల గోవిందరాజు అన్నారు. ఆదివారం పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్య క్రమం నిర్వహించారు.
నరసన్నపేట: రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, దీనిని అంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పట్టణ నాయకులు బోయన సతీష్, తాళాభక్తుల గోవిందరాజు అన్నారు. ఆదివారం పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్య క్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ని ఇంటికి పంపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి అధినేత చంద్రబాబు నాయుడును సీఎంగా చేయాలని కోరారు. ఆరు గ్యారెంటీలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీతోనే ఉపాధి
జలుమూరు (సారవకోట): రాష్ట్రంలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు టీడీపీ తోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. తొగిరి పంచాయతీ తర్లి గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యా లపై ప్రజలకు చైతన్యం చేశారు. టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత పిళ్లా నందకిశోర్, టీడీపీ నాయకులు జోగారావు, అప్పారావు, డి.జయరాం తదితరులు పాల్గొన్నారు.