ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:39 PM
సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కొత్తూరు సీఐ వేణుగోపాలరావు కోరారు. బుధవారం గులుమూరు గ్రామంలో ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు.
![ప్రశాంత ఎన్నికలకు సహకరించండి](https://media.andhrajyothy.com/media/2024/20240326/3hlm3_b70d077837.gif)
హిరమండలం: సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కొత్తూరు సీఐ వేణుగోపాలరావు కోరారు. బుధవారం గులుమూరు గ్రామంలో ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడ దన్నారు. ఓట్ల కోసం లంచం ఇవ్వడం, ప్రలోభ పెట్టడం చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణస్వామి, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.