ధర్మానపై కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:05 AM
రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి.. ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
![ధర్మానపై కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 21: రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి.. ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ జి.వాసు తెలిపిన వివరాలివీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సాయంత్రం కళ్లేపల్లిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. అక్కడ గ్రామ సచివాలయం వద్ద విద్యుత్ దీపాలు అమర్చి.. ప్రచారం నిర్వహించారు. కొంతమంది స్థానికులకు వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఎంసీసీ బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ వాసు తెలిపారు.
- అలాగే శుక్రవారం రాత్రి స్థానిక సన్రైజ్ హోటల్లో విశ్రాంత ఉద్యోగులకు ఆత్మీయ కలయిక పేరుతో ధర్మాన ప్రసాదరావు సమావేశం ఏర్పాటు చేసి.. విందు ఇచ్చారు. దీనిపై కూడా ఎంసీసీ బృందం ఫిర్యాదు చేయడంతో ధర్మానపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.