టీ షర్ట్ కోసం ఘర్షణ
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:40 PM
టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో క్షణికావేశంతో తమ్ముడు నెట్టేయడంతో అన్న కిందపడగా తలకు తీవ్రగాయమైంది. కుటుం బ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొం దుతూ అన్న ప్రాణాలు కోల్పోయాడు.
![టీ షర్ట్ కోసం ఘర్షణ](https://media.andhrajyothy.com/media/2024/20240326/5sbm1_6ba5a34e15.gif)
- సోదరుల మధ్య తగాదాలో అన్న మృతి
సంతబొమ్మాళి, ఏప్రిల్ 5: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో క్షణికావేశంతో తమ్ముడు నెట్టేయడంతో అన్న కిందపడగా తలకు తీవ్రగాయమైంది. కుటుం బ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొం దుతూ అన్న ప్రాణాలు కోల్పోయాడు. సంతబొమ్మా ళి మండలం కాకరాపల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకరాపల్లికి చెందిన తాళాభక్తుల రమేష్ (31), సురేష్(25) అన్నదమ్ములు. వీరిద్దరూ తల్లి దండ్రులు ఆదినారాయణ, రత్నాలుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రమేష్కు వివాహం కాగా.. భార్య స్వాతితో పాటు ఒక కుమారుడు ఉ న్నాడు. అన్నదమ్ములిద్దరూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా.. గురువారంరాత్రి రమేష్ టీ షర్ట్ను సురేష్ ధరించాడు. తన టీ షర్ట్ ఎందుకు వేశా వంటూ రమేష్ తమ్ముడిని నిలదీశాడు. టీ షర్ట్ వేసినందుకే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావంటూ సురేష్ ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్ష ణకు దారి తీసింది. క్షణికావేశంతో సురేష్ తన అన్నను నెట్టేశా డు. దీంతో రమేష్ ఓ రాయిపై పడగా తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుం బ సభ్యులు అప్రమత్తమై రమేష్ను శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేష్ మృతి చెం దాడు. దీంతో భార్య, కుమా రుడితోపాటు తల్లిదండ్రులు విలపించారు. చిన్నపాటి ఘర్ష ణలో ఊహించని విధంగా తమ కొడుకు ప్రాణాలు కోల్పో యాడంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సిద్దార్థ్ తెలిపారు.