Share News

మద్యం బాటిల్స్‌తో కారు సీజ్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:07 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలు తరలిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం బాటిల్స్‌తో కారు సీజ్‌

శ్రీకాకుళం క్రైం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలు తరలిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సీసాలతో కారును సీజ్‌ చేశారు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి చింతాడ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో మూడు ఆర్మీ ఫుల్‌ బాటిల్స్‌, మూడు బీర్లతో సింగుపురం రోడ్‌లోకి రావడంతో వారిపై అనుమానంతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఎక్సైజ్‌, పోలీసు బృందం వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో మద్యం బాటిల్స్‌ ఉన్నట్టు గుర్తించిన ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం కారును రూరల్‌ పోలీసులకు అప్పగించగా, ఎస్‌ఐ వాసు కారు సీజ్‌ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:07 AM