తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలి
ABN , Publish Date - Feb 02 , 2024 | 11:43 PM
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న తెలగ కులస్థులను ఆదుకోవాలని ఉత్తరాంధ్ర తెలగ కుల సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకటరామారావు డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్ర వారం టెక్కలికి చేరుకుంది.
![తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/2tklp1_0e30988d6b.gif)
టెక్కలి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న తెలగ కులస్థులను ఆదుకోవాలని ఉత్తరాంధ్ర తెలగ కుల సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకటరామారావు డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్ర వారం టెక్కలికి చేరుకుంది. ఈ సంద ర్భంగా ఆయనకు స్థానిక సంఘ నేతలు దోని కొండలరావు, ఇల్లా కోదండ, బొంగు పెంటయ్య, గుర్జు దాసు, పువ్వల ఢిల్లీ, ఇండుగ సోమేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలగ కులస్థులు సన్నకారు రైతులుగా, రైతు కూలీ లుగా, భవన నిర్మాణ కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారన్నారు. తెలగ కులస్థులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు.