సివిల్స్లో బాన్న వెంకటేష్ సత్తా
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:54 PM
జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఐఏఎస్ లక్ష్యంతో కష్టపడి చదివి రెండో ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 467వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు.
![సివిల్స్లో బాన్న వెంకటేష్ సత్తా](https://media.andhrajyothy.com/media/2024/20240413/16_jlm_1_A_4dc2e02c70.gif)
- జాతీయస్థాయిలో 467వ ర్యాంకు
జలుమూరు, ఏప్రిల్ 16: జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఐఏఎస్ లక్ష్యంతో కష్టపడి చదివి రెండో ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 467వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు ధాన్యం వ్యాపారి. తల్లి రోహిణి గృహిణి. వెంకటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం మారుమూల గ్రామమైన అల్లాడపేటలోనే సాగింది. మునసబుపేటలోని ప్రైవేటు స్కూల్లో పదోతరగతి వరకు చదివారు. విశాఖ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం 2019లో తమిళనాడు తిరుచనాపల్లిలో ఎన్ఐటీ పూర్తిచేసి.. రెండేళ్లు తమిళనాడులోని కోల్కం కంపెనీలో పనిచేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో గురి తప్పగా.. రెండో ప్రయత్నంలో 467వ ర్యాంకు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు. ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని వెంకటేష్ తెలిపారు. వెంకటేష్కు జాతీయస్థాయిలో ర్యాంకు రావడంతో గ్రామస్థులు ఆయనను అభినందిస్తున్నారు.