మద్యం మత్తులో సీహెచ్సీ సిబ్బందిపై దాడి
ABN , Publish Date - May 20 , 2024 | 11:51 PM
కొండములగాం సీహెచ్సీ సిబ్బంది పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు.
రణస్థలం, మే 20: కొండములగాం సీహెచ్సీ సిబ్బంది పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం ఇద్దరు యువకులు కెల్ల నవీన్కుమార్, కెల్ల జగన్ చిన్నచిన్న దెబ్బలతో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లారు. వైద్య సిబ్బంది చికిత్స చేస్తుండగా ఆ ఇద్దరు యువకులు.. తమ సెక్యూరిటీ సిబ్బంది సంతుపై దాడి చేసి, రికార్డులు ధ్వంసం చేశారని సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ లలిత తెలిపారు. ఈమేరకు జేఆర్పురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.