Share News

దుర్గ్‌ నుంచి బరంపురం వరకు రైలు ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:00 AM

చత్తీస్‌గడ్‌ రాష్ట్రం బిలాయి, దుర్గ్‌, రాయిపూర్‌ ప్రాంతాల్లో జిల్లాకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నందున దుర్గ్‌ నుంచివయా విజయనగరం మీదుగా ఒడిశా రాష్ట్రం బరం పురం వరకు కొత్త రైలు ఏర్పాటుకు చర్యలు తీసుకో వాలని ఆంధ్రా ఉత్కల్‌ సంఘర్ష్‌ సమితి ప్రతినిధులు కోరారు.

దుర్గ్‌ నుంచి బరంపురం వరకు రైలు ఏర్పాటు చేయండి
వినతిపత్రం అందిస్తున్న సమితి ప్రతినిధులు

వజ్రపుకొత్తూరు: చత్తీస్‌గడ్‌ రాష్ట్రం బిలాయి, దుర్గ్‌, రాయిపూర్‌ ప్రాంతాల్లో జిల్లాకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నందున దుర్గ్‌ నుంచివయా విజయనగరం మీదుగా ఒడిశా రాష్ట్రం బరం పురం వరకు కొత్త రైలు ఏర్పాటుకు చర్యలు తీసుకో వాలని ఆంధ్రా ఉత్కల్‌ సంఘర్ష్‌ సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చె న్నాయుడులకు సమితి అధ్యక్షుడు ఉమాశంకర్‌, డోకులపాడు మాజీ సర్పంచ్‌ అంబటి రామకృష్ణ వినతి పత్రం అందించారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి ఈనెలలో జరగనున్న బడ్జెట్‌ సమావేశంలో సంబంధిత మంత్రితో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాస పాపారావు, పల్లేటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:00 AM