ఏపీఎస్ఎస్టీఎఫ్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:41 PM
ఆంధ్రప్రదేశ్ సాంఘి క శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.
గుజరాతీపేట/సంతబొమ్మాళి: ఆంధ్రప్రదేశ్ సాంఘి క శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు వైవీ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా తూలగాపు కేశవరావు, జిల్లా ప్రధాన కార్య దర్శిగా బాడాన రాజు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా ఎం.శ్రీని వాసరావు, జిల్లా గౌరవ సలహాదారులుగా డి.కేశవరావు తోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమం లో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.