Share News

నరసన్నపేటలో లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:39 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారంరాత్రి నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్‌కు చేరుకు న్నారు. సభ ప్రాంగణం వద్ద ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి, కుటుం బ సభ్యులు బగ్గు సుగుణ, అర్చన, సునీతలతో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

నరసన్నపేటలో లోకేశ్‌కు ఘన స్వాగతం
నారా లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న బగ్గు రమణమూర్తి దంపతులు

నరసన్నపేట, ఫిబ్రవరి 11: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారంరాత్రి నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్‌కు చేరుకు న్నారు. సభ ప్రాంగణం వద్ద ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి, కుటుం బ సభ్యులు బగ్గు సుగుణ, అర్చన, సునీతలతో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి, టీడీపీ నాయకులు ధర్మాన తేజ్‌కుమార్‌, గొద్దు చిట్టి బాబు, బైరి భాస్కరరావు, బెవర రాము, బోయన సతీష్‌, సురవరపు తిరుపతిరావు, బగ్గు గోవిందరావు, ఎంవీ అప్పల నాయుడు, వెలమల రాజేంద్రనాయుడు , రెడ్డి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

నామమాత్రంగా ప్రభుత్వ సెక్యూరిటీ

జమ్ము జంక్షన్‌ వద్ద లోకేశ్‌ బస చేసిన స్థలం వద్ద పోలీసుల భద్రత నామమాత్రంగా కల్పించారు. కేవలం నామమాత్రంగానే పోలీసులు తక్కువగా ఉన్నారు. లోకేశ్‌ నరసన్నపేట చేరుకునేసరికి ఎస్‌ఐ ఆశోక్‌బాబుతో పాటు ఒక ఏఎస్‌ఐ మాత్రమే సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మిగతా బలగా లేవీ కనిపించలేకపోవడం గమనార్హం. దీంతో లోకేశ్‌ ప్రైవేటు సెక్యూరిటీ అప్రమత్తమై బస చేసే టెంటు చుట్టూ కాపలాగా ఉన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:39 AM