అ‘పూర్వ’ సమ్మేళనం
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:59 PM
కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. అందరూ ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందం పొందారు.
![అ‘పూర్వ’ సమ్మేళనం](https://media.andhrajyothy.com/media/2023/20231205/17_Ptnm_1_bcd113f5fa.gif)
పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. అందరూ ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందం పొందారు. నాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. అనారో గ్యంతో మృతి చెందిన విద్యార్థులకు నివాళి అర్పించారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయుడు ప్రసాదరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
దీర్గాశిలో...
పోలాకి: దీర్గాశి జడ్పీ ఉన్నత పాఠశాలలో 2003-2004లో పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం బుధవారం నిర్వహించారు. సుమారు 23 ఏళ్ల అనంతరం కలుసుకున్న వారంతా నాటి మధు రానుభూతులను తెలుపుకుని ఆనందం పొందారు. నాడు విద్యా బుద్ధులు నేర్పిన 13 మంది ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి సాంబమూర్తి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వాహకులు చిట్టి తాతబాబు, శిమ్మన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
బొరివంకలో...
కవిటి: బొరివంక ఉన్నత పాఠశాలలో 1990-91లో టెన్త్ చదువు కున్న విద్యార్థులు, ముత్యాల పేట ఉన్నత పాఠశాలలో 2006-07లో టెన్త్ చదువుకున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. చదువు చెప్పిన గురువులు పి.బాలయ్య, బి. ఉమామహేశ్వరరావు, బి.శంకర్రావు, రామకృష్ణలను సత్కరించారు. పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.