ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వర్షప్రియకు చోటు
ABN , Publish Date - Jul 20 , 2024 | 11:24 PM
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ప్లో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ) తృతీయ సంవ త్సరం విద్యార్థిని బోటు వర్షప్రియకు స్థానం లభిం చిందని కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు ఒక ప్రక టనలో తెలిపారు.
టెక్కలి: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ప్లో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ) తృతీయ సంవ త్సరం విద్యార్థిని బోటు వర్షప్రియకు స్థానం లభిం చిందని కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు ఒక ప్రక టనలో తెలిపారు. 17.15 నిమిషాల్లో పెన్సిల్ ముల్లుపై ఏ నుంచి జెడ్ వరకు 26 అంకెలను బ్లేడు సాయంతో చెక్కి ఇండియా బుక్లో స్థానం పొందింద న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సరదాగా సుద్దముక్కలు, పెన్సిళ్లపై బొమ్మలు వేసుకునే తనకు అరుదైన అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వర్షప్రియను డైరెక్టర్తో పాటు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, హెచ్వోడీ అశోక్కుమార్, లలితాభవానీ, తల్లిదండ్రులు అభినందించారు.