Share News

వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:08 AM

బెజ్జిపురానికి చెందిన కింతలి క్రాంతికుమార్‌ (35) బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

లావేరు: బెజ్జిపురానికి చెందిన కింతలి క్రాంతికుమార్‌ (35) బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. క్రాంతికుమార్‌కు పదేళ్ల కిందట రాజాం మండలం సోపేరు గ్రామానికి చెందిన దాసరి వసుంధరతో వివాహం అయింది. కొన్నాళ్లుగా వీరిమధ్య మనస్ఫర్థలు రావడంతో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కోర్టులో నడుస్తుంది. కాగా క్రాంతి కుమార్‌ ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్యపై ఆరోపిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియలో పోస్టు చేశాడు. తన చావుకు భార్య వసుంధర, అత్త గున్నమ్మ, మామ సూరిబాబు, బావమరుదులు సాయి, దిలీప్‌, తాత తవుడులతో పాటు బెజ్జిపురానికి చెందిన మరికొంత మంది వ్యక్తులు నాపై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు గురి చేస్తుండడంతో మస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారు. తన చావుకు కారకులైన అందరిపై చర్యలు తీసుకోవాలని వీడీయో ద్వారా పోలీసులను వేడుకున్నాడు. క్రాంతికుమార్‌ తండ్రి చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌ స్వామినాయుడు తెలిపారు. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:08 AM