లారీలో అగ్నిప్రమాదం.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:50 PM
స్థానిక జాతీ యరహదారి లక్ష్మీపురంటోల్ప్లాజా వద్ద గురువారం ఐరన్ తీగలతో వెళ్తున్న ఓ లారీలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు గుర్తిం చి కాశీబుగ్గ అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో త్రుటి లో పెనుప్రమాదం తప్పింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీలో బ్రేక్ వద్ద పొగలు వస్తున్న విషయాన్ని సంబంధిత డ్రైవర్ గుర్తించి లారీని రోడ్డు పక్కన నిలిపివేశారు. అనంతరం మంటలు రావడంతో లారీ దిగి దగ్గరలో ఉన్న హైవే, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. లేకుంటే లారీ మొత్తం దగ్ధమయ్యేది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
పలాస/రూరల్: స్థానిక జాతీ యరహదారి లక్ష్మీపురంటోల్ప్లాజా వద్ద గురువారం ఐరన్ తీగలతో వెళ్తున్న ఓ లారీలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు గుర్తిం చి కాశీబుగ్గ అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో త్రుటి లో పెనుప్రమాదం తప్పింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీలో బ్రేక్ వద్ద పొగలు వస్తున్న విషయాన్ని సంబంధిత డ్రైవర్ గుర్తించి లారీని రోడ్డు పక్కన నిలిపివేశారు. అనంతరం మంటలు రావడంతో లారీ దిగి దగ్గరలో ఉన్న హైవే, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. లేకుంటే లారీ మొత్తం దగ్ధమయ్యేది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.