Share News

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:54 PM

కుమార్తె తండ్రికి తలకొరిపెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించిన సంఘటన తాళ్లభద్ర జరిగింది. గ్రామస్థుల కథనం మేరకు... సొంపేట మండ లంలోని తాళ్లభద్రకు చెందిన సారి కూర్మయ్య (75) గురువారం మృతిచెందాడు. చాలా ఏళ్ల కిందట కూర్మయ్య భార్యకూడా మృతి చెందింది. నలుగురు కుమార్తెలకు గాను ముగ్గురికి వివాహం జరగడంతో అత్తవారి ఇళ్లకు వెళ్లిపోయారు. రెండోకుమార్తె జానకి తండ్రి చేదోడుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తండ్రి మృతి చెందడంతో తలకొరివి పెట్టింది.

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
తలకొరి పెడుతున్న కుమార్తె జానకి:

సోంపేట: కుమార్తె తండ్రికి తలకొరిపెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించిన సంఘటన తాళ్లభద్ర జరిగింది. గ్రామస్థుల కథనం మేరకు... సొంపేట మండ లంలోని తాళ్లభద్రకు చెందిన సారి కూర్మయ్య (75) గురువారం మృతిచెందాడు. చాలా ఏళ్ల కిందట కూర్మయ్య భార్యకూడా మృతి చెందింది. నలుగురు కుమార్తెలకు గాను ముగ్గురికి వివాహం జరగడంతో అత్తవారి ఇళ్లకు వెళ్లిపోయారు. రెండోకుమార్తె జానకి తండ్రి చేదోడుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తండ్రి మృతి చెందడంతో తలకొరివి పెట్టింది.

Updated Date - Feb 01 , 2024 | 11:54 PM