Share News

Somu Veerraju: వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు

ABN , Publish Date - Jan 10 , 2024 | 01:50 PM

వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మోదీ ఏపీలో కోటి మందికి బియ్యం ఇస్తున్నారన్నారు. ఎకరానికి రెండు పంటలకు 18 వేల సబ్సిడీ మోదీ ఇస్తున్నారన్నారు.

Somu Veerraju: వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు

రాజమండ్రి: వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మోదీ ఏపీలో కోటి మందికి బియ్యం ఇస్తున్నారన్నారు. ఎకరానికి రెండు పంటలకు 18 వేల సబ్సిడీ మోదీ ఇస్తున్నారన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను వైఎస్సార్ ఆరోగ్య మందిర్‌గా పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు.

కేంద్ర పథకాలను తన పథకాలుగా జగన్ కొత్త కల్పన సృష్టిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లోనే నంబర్ 1గా ఉన్న మోదీపై మాట్లాడే అర్హత ఏపీలో నేతలకు లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతీ గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులను ప్లెక్సీలు వేసి ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 01:50 PM