Share News

గెలుపు బాటలో మీరే భాగస్వాములు

ABN , Publish Date - May 14 , 2024 | 11:26 PM

గెలుపు బాటలో మీరే భాగస్వాములని ఎన్డీయే కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన సభలో డాక్టర్‌ ఉగ్ర కార్యకర్తలు, నాయకులకు, శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పారు.

గెలుపు బాటలో మీరే భాగస్వాములు
కృతజ్ఞత సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ ఉగ్ర

టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పిన డాక్టర్‌ ఉగ్ర

కిక్కిరిసిన అమరావతి ప్రాంగణం

కనిగిరి, మే 14 : గెలుపు బాటలో మీరే భాగస్వాములని ఎన్డీయే కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన సభలో డాక్టర్‌ ఉగ్ర కార్యకర్తలు, నాయకులకు, శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పారు. టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందంటూ నియోజవర్గంలోని వివిధ మండలాల్లోని నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి డాక్టర్‌ ఉగ్రకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకుల కష్టానికి నిన్న జరిగిన ఎన్నికలు ఓ గుర్తింపుగా మారనున్నాయన్నారు. ప్రతి కార్యకర్త తానే పోటీలో ఉన్నట్లుగా భావించి అలుపెరగని కష్టం చేశారని కొనియాడారు. గతంలో కనిగిరి నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేదన్నారు. అలాంటిది 2019 ఎన్నికల్లో వైసీపి గాలిలో ఓటమి చెందానని చెప్పారు. ఆ కసిని నిన్నటి ఎన్నికల్లో టీడీపీ సైన్యం చూపించిన తీరు అభినందనీయమన్నారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో పోలింగ్‌ జరగటం టీడీపీ గెలుపునకు ప్రధాన సూచిక అని చెప్పారు. జూన్‌ 4న కౌంటింగ్‌ అనంతర విజయోత్సవ సభను జరుపుకుందామన్నారు. డాక్టర్‌ ఉగ్రను కలిసేందుకు వచ్చిన వారితో అమరావతి ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

Updated Date - May 14 , 2024 | 11:26 PM