ప్రజాసంక్షేమానికి వైసీపీ తూట్లు
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:27 AM
ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడిచిందని, నిరంకుశ పాలనకు త్వరలోనే అంతం అవుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 11 : ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడిచిందని, నిరంకుశ పాలనకు త్వరలోనే అంతం అవుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బేస్తవారపేట మండలానికి చెందిన వైసీపీ కీలక నేత సత్తేలి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అశోక్రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ పెద్దపీట వేస్తోందన్నారు. వారి అభ్యున్నతి కోసం అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కృష్ణయాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్రెడ్డి గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో సత్తేలి రంగయ్య, సత్తేలి కాశి, చక్కా సరస్వతి, వీణ, బాదం కృష్ణ, తదితరులు ఉన్నారు. బేస్తవారపేట మండలపార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహయాదవ్, ఎంపీటీసీ సభ్యుడిగా పూనూరి భూపాల్రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాం, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, క్లస్టర్ ఇన్చార్జ్ ముప్పూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో పలుకుటుంబాల చేరిక
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం ఉదయం కంభం మండలం యర్రబాలెం పంచాయతీలోని చిన్ననల్లకాల్వకు చెందిన 15 కుటుంబాలు, గిద్దలూరు మండలం గుమ్మళ్ళపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చిన్ననల్లకాల్వకు చెందిన వారిలో ఎన్.లక్ష్మమ్మ, ఎన్.పెద్ద రామయ్య, బలరామయ్య, నాగన్న, ఎం.వెంకటయ్య, బి.తిరుపతి, ఎన్.లక్ష్మయ్య, టి.మల్లయ్య, ఎన్.సుధాకర్, జయరాములు, రామకృష్ణ, పిచ్చిరెడ్డి ఉన్నారు. గుమ్మళ్లపల్లికి చెందిన పందిళ్ల పెద్దగురువయ్య, గుమ్మళ్ల వెంకటరమణ, ఎం.ఆంజనేయులు, బి.చిన్నగురువయ్య, బి.చిన్నబ్బి, బి.బ్రహ్మయ్య ఉన్నారు. కార్యక్రమంలో కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను, గోన చెన్నకేశ వులు, పేరబోయిన రామక్రిష్ణయాదవ్, నల్లబోతుల వెంకటేశ్వర్లు, బాలక్రిష్ణ, రమేష్ తదితరులు ఉన్నారు.
టీడీపీ అంటేనే అభివృద్ధి
మార్కాపురం వన్టౌన్ : రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కీర్తి పథంలో నడిపించిన ఘనత టీడీపీకే దక్కుతుందని, టీడీపీ పోల్ మేనేజ్మెంట్ కో-ఆర్డినేటర్ కందుల రామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఆదివారం రాత్రి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మీ మాట్లాడుతూ వైసీపీని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు. టీడీపీ-జనసేన పొత్తుకే పట్టం కడతారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.